సైరా కోసం వారు రాలేదే

నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రాజమౌళి, కొరటాల, వినాయక్ [more]

Update: 2019-09-23 06:26 GMT

నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రాజమౌళి, కొరటాల, వినాయక్ లాంటి వాళ్ళు అంతా కనిపించారు కానీ… సైరా సినిమాలో నటించిన చాలామంది నటులు కనిపించలేదు. ఎప్పుడూ ప్రమోషన్స్ కి రాకుండా తప్పించుకునే నయనతారను రామ్ చరణ్ బ్రతిమిలాడి సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొస్తున్నాడనే ప్రచారం జరగడంతో.. ఈ ఈవెంట్ కి నయన్ వస్తుంది అనుకున్నారు. కానీ సైరా ఈవెంట్ కి నయన్ ఎప్పటిలాగే హ్యాండ్ ఇచ్చింది. కాకపోతే మరో తార తమన్నా రాకపోవడం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. సైరా టీజర్ రిలీజ్ వేడుకకి ముంబై వెళ్లిన తమన్నా కూడా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవలేదు. ఇక విజయ్ సేతుపతి ఈవెంట్ చివరిలో వచ్చి జాయిన్ అయ్యాడు.

హ్యాండిచ్చిన అమితాబ్ ….

ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ కూడా చిరుకి హ్యాండ్ ఇచ్చాడు. మొన్నటి నుంచి అమితాబ్ సైరా ప్రమోషన్స్ కి రానని చెప్పినట్లుగా న్యూస్ నడుస్తుంది. మరది నిజమే అన్నట్టుగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. ఇక కన్నడ నటుడు సుదీప్ కూడా ఈ ఈవెంట్ కి హాజరవలేదు. మరి సినిమాలో సుదీప్, అమితాబ్, నయనతార, తమన్నా రోల్సే చాలా ఇంపార్టెంట్. మరి వారెవరూ ఈ సైరా ఈవెంట్ కి రాకపోవడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇక సైరా ఈవెంట్ కూడా వర్షం వలన అనుకున్నట్టుగా ఏమంత గొప్పగా జరగలేదు.

 

Tags:    

Similar News