నమ్రతతో క్లోజ్.. అయితే అది ఫిక్స్!!

కరోనా లాక్ డౌన్ ముగిసినా మహేష్ బాబు – పరశురామ్ సర్కారు వారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో తెలియదు. మహేష్ బాబు కరోనా తగ్గాకే [more]

Update: 2020-06-15 13:10 GMT

కరోనా లాక్ డౌన్ ముగిసినా మహేష్ బాబు – పరశురామ్ సర్కారు వారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో తెలియదు. మహేష్ బాబు కరోనా తగ్గాకే సినిమా షూటింగ్ అంటున్నాడట. ఈలోపు వుపరశురాం సినిమా స్క్రిప్ట్, నటుల ఎంపిక అంటూ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పడ్డాడు. అయితే సర్కారు వారి పాట కోసం మహేష్ కి జోడిగా ఎలాగైనా కియారా అద్వానీ ని పట్టుకురావాలనుకుంటే.. కియారా అద్వానీ డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక చేతులెత్తెయ్యడంతో.. మహేష్ జోడిగా మరో బాలీవుడ్ భామని ఫిక్స్ చేశారనే న్యూస్ నడుస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి మంజ్రేకర్ ని మహేష్ కోసం పరశురామ్ అండ్ టీం సంప్రదిస్తున్నదని.. దాదాపుగా సాయి మంజ్రేకర్ ఫిక్సనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా సాయి మంజ్రేకర్ తో మట్లాడుతూ మీరు మహేష్ సినిమాలో నటిస్తున్నారట.. అందుకోసం మిమ్మల్ని దర్శకుడు పరశురామ్ టీం సంప్రదించింది అని అడగగా..
ఏమో నాకు తెలియదు.. మహేష్ సినిమాలో నేను నటిస్తున్నా అనే న్యూస్ ఒట్టి పుకారు మాత్రమే. అయినా నేను ఇప్పుడు చెయ్యకపోయినా.. ఫ్యూచర్ లో సౌత్ సినిమాలో నటిస్తాను., అసలు మహేష్ వైఫ్ కాకముందే నమ్రతతో మా పేరెంట్స్ చాలా సన్నిహితంగా ఉంటారని చెబుతుంది. అంటే నమ్రతతో సాయి ఫ్యామిలీ క్లోజ్ అయితే మహేష్ పక్కన సర్కారు వారి పాటలో ఆమె నటించడం ఖాయమే. నమ్రత తలచుకుంటే ఆమె ఇక్కడ నటించడం పెద్ద విషయం కాదు. అయితే నమ్రత ఎక్కువగా కియారా కోసం ప్రయత్నించింది అని.. ఆమె కాదు కూడదు అంటే అప్పుడు లేలేత అందాల సాయి మంజ్రేకర్ ని ఖాయం చేస్తారని అంటున్నారు. ఎలాగూ సాయి మంజ్రేకర్ ఫ్యామిలీ నమ్రతకు కావాల్సిన వారే కదా. అందుకే పని జరుగుద్ది అంది. 

Tags:    

Similar News