అందుకే ఆమె ఒక్క పీస్..!

Update: 2018-12-03 07:33 GMT

టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చేస్తూ పిచ్చెక్కిస్తున్న మలయాళ భామ సాయిపల్లవి తనకి సినిమా కథ, అందులోని తన పాత్ర నచ్చితేనే సినిమా చేస్తుంది. లేదంటే మొహమాటం లేకుండా సినిమా చెయ్యనని చెప్పేస్తుంది. అలాగే ఆ సినిమాలో తన పాత్రకి ఎక్కువ డామినేషన్ ఉండేలా అంటే హీరోలకన్నా కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలనుకుంటుంది. ఫిదా కానివ్వండి, కణం కానివ్వండి.. ఏ సినిమా అయినా సరే. అలాగే తన పాత్ర నచ్చక ఇప్పటికే సాయిపల్లవి చాలా సినిమాలకు నో చెప్పిందనే టాక్ ఉంది. తాజాగా తెలుగులో పడి పడి లేచే మనసులో శర్వా పక్కన, తమిళంలో మారి 2లో ధనుష్ సరసన నటిస్తున్న ఈ భామ సూర్య సరసన కూడా నటిస్తుంది.

మరో సినిమాకు నో చెప్పిందా..?

మరి పడి పడి లేచే మనసు, మారి 2లో సాయి పల్లవి పాత్రలెలా ఉండబోతున్నాయో.. ఆ సినిమా సింగిల్స్ లోనే చూసాం. హీరోల మీద కూసింత ఎక్కువే డామినేషన్ సాయి పల్లవిలో కనబడుతుంది. ఇక అలాంటి సాయి పల్లవి ఇప్పుడు మరో సినిమాకి నో చెప్పిందని ఫిలింనగర్ టాక్. అది కూడా హీరో నచ్చకో.. లేదంటే కథ నచ్చకో గాని... సితార ఎంటర్టైన్మెంట్స్ దర్శకుడు విరంచి వర్మ తెరకెక్కించబోయే సినిమాకి సాయి పల్లవి నో చేపిందనే టాక్ నడుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విరంచి వర్మ - కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించగా... ప్లాప్ హీరోతో మనకెందుకులే అనుకుందో లేదంటే కథలో తన పాత్ర నచ్చలేదో గానీ ఆ సినిమాకి నో చెప్పిందట. మరి ఫిదాలో భానుమతి ఒక్కటే పీస్ అన్నట్టుగా లేదు సాయి పల్లవి వరస చూస్తుంటే... ఇలాంటి డామినేటింగ్ హీరోయిన్ కి స్టార్ హీరోస్ ఎవరు పిలిచి అవకాశం ఇస్తారు చెప్పండి. అందుకేనేమో స్టార్ హీరోలెవరు సాయి పల్లవి ఊసెత్తడం లేదు.

Similar News