బడా ఆఫర్ ని కాలదన్నిన భానుమతి..?

Update: 2018-08-06 08:36 GMT

ఈ మధ్యన ఎటు చూసిన ఫిదా బామ సాయి పల్లవి మీదే మీడియా ఫోకస్ ఉంది. ఈమధ్యన సాయి పల్లవిపై నెగెటివ్ న్యూస్ లు బాగా ఎక్కువయ్యాయి. ఆమె ఏ సినిమా షూటింగ్లో ఉన్నా.. అక్కడ సాయి పల్లవిపై ఎదో ఒక నెగెటివ్ న్యూస్ ప్రచారంలోకొచ్చేస్తుంది. ఒకటా రెండా ఎంసీఏ అప్పుడు నానితో, కణం అప్పుడు నాగ శౌర్యతో, ఎన్జీకే సినిమా దర్శకుడితో.. తాజాగా పడి పడి లేచే మనసు హీరో శర్వానంద్ తో ఇలా ఆమెకి హీరో, దర్శకులతో విభేదాలు వస్తున్నాయనే న్యూస్ మాములుగా వినబడడం లేదు. ఈ లోపు ఆమెకి సినిమాలో తన పాత్ర నచ్చితేనే.. సినిమాలు ఒప్పుకుంటుంది. లేదంటే మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే దిల్ రాజు అడిగితే శ్రీనివాస కళ్యాణం సినిమా చెయ్యనందని.. అందుకే సాయి పల్లవి ప్లేస్ లో రాశి ఖన్నాని తీసుకున్నారంటారు.

రెండు కోట్ల ఆఫర్ కాదంది..

తాజాగా ఇప్పుడు సాయి పల్లవి మరో బడా నిర్మాత చేసిన కోట్ల ఆఫర్ ని కాలదన్నిందంటున్నారు. తన కొడుకుని స్టార్ హీరో చెయ్యడానికి ఆ నిర్మాత ఎప్పటి నుండో కలలు కంటున్నాడు. అందుకే భారీ బడ్జెట్ తో సినిమాలు చెయ్యడమే కాదు... తన కొడుకు కోసం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ ని తీసుకొస్తాడు. కానీ అతను మాత్రం స్టార్ హీరోగా ఎదగలేక ఇబ్బంది పడుతున్నాడు. అయినా ఆ నిర్మాత పట్టు వదలని విక్రమార్కుడిలా కొడుకు కోసం ఇంకా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ మొత్తం అతని కొడుకు పక్కన నటించారు. ఇక సాయి పల్లవి క్రేజ్ తో అయినా తన కొడుక్కి కాస్త పేరొస్తుందని అతను అనుకోవడం సాయి పల్లవిని కలవడం.. ఆమెకు 2 కోట్ల ఆఫర్ చెయడం జరిగిందట. ఇంతకుముందు టాప్ హీరోయిన్స్ కి కూడా ఆ నిర్మాత ఇలానే అధిక పారితోషకం ఆఫర్ చేసి తన కొడుకు పక్కన వాళ్లని నటింపచేసాడు. మరి భారీ పారితోషకాలకు టాప్ హీరోయిన్స్ సలాం చేశారు. కానీ ఇక్కడ సాయి పల్లవి మాత్రం ఆ బడా నిర్మాతకి షాకిచ్చిందనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. డబ్బు కోసం తాను నటించానని సినిమాలో తన క్యారెక్టర్ కి డే ప్రాధాన్యత తోనే సినిమా చేస్తానని చెప్పి ఆయన్ని పంపేసిందట. మరి టాప్ హీరోయిన్ కూడా డబ్బుకి పడిపోతే ఈ పిల్లమేమిటండి.. ఇలా.. నిజంగానే ఈ పిల్ల హైబ్రిడ్ పిల్లనే అంటున్నారు అంతా.

Similar News