సాయి పల్లవి కల నిజమైంది!

Update: 2018-04-07 06:15 GMT

తెలుగులో ఫిదా సినిమాతో అందరి మనసు దోచుకున్న సాయి పల్లవి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. భాషతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ ఐన సాయి పల్లవి ఇప్పుడు స్వంత భాష తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది.

తమిళ్ లో మొదటి సినిమా 'కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో రూపొందిన ఈ సినిమాలో నాగశౌర్య పక్కన నటించింది సాయి పల్లవి. వీరిద్దరి మధ్య విభేదాల వల్ల సినిమా షూటింగ్ కూడా కొంత ఆలస్యం అయింది. తెలుగు.. తమిళ్ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు నిర్మతలు. కానీ తమిళనాడులో స్ట్రైక్ వల్ల సినిమా పోస్టుపోన్ అయింది. అయితే తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నిర్మాతలు.

అయితే మొదటి సినిమా రిలీజ్ కాకముందే తమిళ్ లో సూర్య పక్కన ‘ఎన్ జీ కే’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ చిన్నది. చిన్నప్పటి నుండి సూర్య అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో నటించాలనేది నా కల... ఇలా నెరవేరడం సంతోషంగా ఉంది’ అంటూ ఉబ్బితబ్బివవుతోంది ఈ చిన్నది. అలాగే తమిళ్ హీరో ధనుష్ సరసన ‘మారి 2’ సినిమాలో నటిస్తోంది సాయిపల్లవి. " షూటింగ్ టైంలో నేను టెన్షన్ గా ఉంటే ఆ టెన్షన్ పోగొట్టానికి ధనుష్ జోకులేసి నవ్వించేవాడు " అంటుంది సాయి పల్లవి. కోలీవుడ్ లో బాగానే ఉంటుంది కానీ టాలీవుడ్ వచ్చేసరికి అందరితో గొడవలే.

Similar News