హరీష్ శంకర్ కి నో చెప్పిన సాయి పల్లవి..!

Update: 2018-10-22 07:54 GMT

'ఫిదా' సినిమాతో తనలోని టాలెంట్ ను తెలుగు ప్రేక్షకులకు చూపించింది సాయి పల్లవి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె నానితో 'ఎంసిఎ' చిత్రం చేసింది కానీ ఇందులో ఆమెకు అంతగా పేరు రాలేదు. దీంతో ఆమె తెలుగులో చేసే సినిమాల విషయంలో కథ కన్నా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకోవాలని డిసైడ్ అయిందంట. ప్రస్తుతం తమిళ్ లో ధనుష్ తో 'మారి 2 ' తో పాటు సూర్య సరసన మరో మూవీ చేస్తోంది. టాలీవుడ్ లో 'పడి పడి లేచే మనసు' సినిమా తప్ప ఇంకేమి లేవు.

మొహమాటం లేకుండా చెప్పేసింది...

ఇది ఇలా ఉండగా హరీష్ శంకర్ గతంలో 'దాగుడుమూతలు' అనే మల్టీ స్టారర్ లో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుందాం అనుకున్నాడట. కానీ ఆమెకు ఈ కథ నచ్చకపోవడంతో, తన పాత్ర ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో మొహమాటం లేకుండా నో చెప్పినట్టు టాక్. కథలు, తన పాత్రల విషయంలో తొందరపడకుండా నచ్చిన పాత్రలకే సైన్ చేస్తోంది. మరి హరీష్ శంకర్ 'దాగుడుమూతలు'లో హీరోలు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం రామ్, నితిన్, శర్వానంద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి ఫైనల్ గా ఎవరు ఓకే అవుతారో తెలియదు. హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు నివేదా థామస్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడట హరీష్ శంకర్. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివారాలు త్వరలోనే తెలియనున్నాయి.

Similar News