తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి

Update: 2018-07-28 05:06 GMT

టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను సాయి పల్లవి మీద వచ్చిన ఆరోపణలు మరే ఇతర హీరోయిన్స్ మీద వచ్చి ఉండవు. సాయి పల్లవి ఏ హీరోతో కలిసి నటించినా అక్కడ షూటింగ్ స్పాట్ లో సాయి పల్లవి కి సదరు హీరోలకు మధ్య యేవో విభేదాలొచ్చాయనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు సాయి పల్లవి ఏ హీరో తో నటించినా అవే ఆరోపణలు. గతంలో తెలుగులో నాని తో గొడవ పడిన సాయి పల్లవి.. తమిళంలో నాగ శౌర్య తో గొడవ పడింది అన్నారు. ఇక అది నిజమని నాగ శౌర్య కూడా ఒప్పుకున్నాడు. అలాగే మొన్నటికి మొన్న సూర్య సినిమా విషయంలోనూ ఈ రకమైన వార్తలే వచ్చాయి.

తాజాగా పడి పడి లేచే మనసు సెట్స్ లోను శర్వానంద్ కి సాయి పల్లవి కి మధ్య గొడవైనదనే న్యూస్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. మరి ఈరకంగా సాయి పల్లవి మీద న్యూస్ రావడం.. ఆమెపై ప్రేక్షకుల్లో నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ రకమైన ప్రచారం సాయి పల్లవి కెరీర్ కి దెబ్బె. అయినా తనపైన ఈ రకమైన న్యూస్ వచ్చినప్పుడల్లా సాయి పల్లవి తనదైన స్టయిల్లో స్పందిస్తూనే ఉంది. గతంలో నాగ శౌర్య విషయంలో కూడా తాను ఫోన్ చేసినా శౌర్య స్పందించలేదని చెప్పింది. ఇక తాజాగా శర్వానంద్ కి తనకి మధ్య విభేదాల మీద కూడా సాయి పల్లవి స్పందించింది.

కొంతమంది శర్వాకి మీకు మధ్య గొడవేమిటి అని ప్రశ్నించగా దానికి సాయి పల్లవి తన పనిని తాను వంద శాతం ప్రత్యేక శ్రద్ధతో చేసి ముగిస్తాను. ఎవరితోనూ తనకు విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చేస్తూ... తనపై వస్తున్నా రూమర్స్ కి చెక్ పెట్టె ప్రయత్నమైతే చేసింది. కానీ సాయి పల్లవి మీద ప్రతి సినిమాకి ఈ రకమైన న్యూస్ రావడం అనేది ఏదో కాకతాళీయంగా జరగలేదు.. నిప్పులేనిదే పొగ రాదు కదా అనేవాళ్ళు ఉన్నారు.

Similar News