సాయి పల్లవి కూడా?

ప్రస్తుతం వెబ్ సీరీస్ ట్రెండ్ నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ కాకముందు నుండే చాలామంది వెబ్ సీరీస్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హీరోలు ఎవరూ వెబ్ సీరీస్ సాహసం [more]

Update: 2020-07-29 05:33 GMT

ప్రస్తుతం వెబ్ సీరీస్ ట్రెండ్ నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ కాకముందు నుండే చాలామంది వెబ్ సీరీస్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హీరోలు ఎవరూ వెబ్ సీరీస్ సాహసం చెయ్యకపోయినా…హీరోయిన్స్ మాత్రం వెబ్ సీరీస్ కి టెంప్ట్ అవుతున్నారు. వెబ్ సీరీస్ లలో కూడా బోలెడంత పారితోషకాలుంటున్నాయి. సినిమా అంత క్రేజ్ కాకపోయినా.. మంచి క్రేజ్ వస్తుంది. ఇప్పటికే సమంత బాలీవుడ్ వెళ్లి అక్కడ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పూర్తి చేసింది. ఇక హన్సిక, తమన్నా, కాజల్ ఆగర్వాల్, త్రిష లు కూడా వెబ్ సీరీస్ వెంట పడుతున్నారు. తాజాగా విలక్షణ నటి సాయి పల్లవి కూడా వెబ్ సీరీస్ చెయ్యబోతుందట.

త‌మిళ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నాడు. ఆ వెబ్ సీరీస్ లో సాయి ప‌ల్ల‌వి ఓ కీలక పాత్ర చేస్తుందట. ఈ వెబ్ సీరీస్ ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. తండ్రీ కూతుర్ల అనుబంధం ఈ వెబ్ సీరీస్ ప్ర‌ధాన క‌థాంశం. అయితే తండ్రి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపిస్తాడని.. ఇప్పటికే స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాత. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇక క‌థ బాగా న‌చ్చ‌డంతో.. సాయి ప‌ల్ల‌వి ఈ వెబ్ సిరీస్ లో న‌టించ‌డానికి ఒప్పుకుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ, విరాట పర్వం సినిమాల్లో న‌టిస్తోంది సాయిప‌ల్ల‌వి.

Tags:    

Similar News