ఈసారి హీరోని వాడడం లేదు.. ఏకంగా హీరోయిన్ నే

మారుతీ దర్శకుడిగా తెరకెక్కిన చాలా సినిమాల్లో హీరోకి ఏదో ఒక లోపం పెట్టి దాని నుండి కామెడీని బయటికి తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. భలే భలే [more]

Update: 2019-06-11 03:59 GMT

మారుతీ దర్శకుడిగా తెరకెక్కిన చాలా సినిమాల్లో హీరోకి ఏదో ఒక లోపం పెట్టి దాని నుండి కామెడీని బయటికి తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లో హీరోలకు మతిమరుపు, అతి శుభ్రమనే రెండు కేరెక్టర్స్ తో సినిమా మొత్తం హాస్యం పండించాడు. ఇక తాజాగా మారుతీ దర్శకుడిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా అతి త్వరలోనే మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెట్టుకింద ప్లీడరు అంటే లాయర్ గా హాస్యం పండిస్తాడని అన్నారు.

కానీ తాజాగా మారుతీ – సాయి ధరమ్ తేజ్ ల కాంబో మూవీ అంతా కుటుంబాలతో కళకళలాడుతూ… అందరూ నవ్వుతూ తుళ్ళుతూ పండగలా ఉంటుందట. అందుకే ఈ సినిమాకి ప్రతి రోజు పండగ అయినా.. లేదంటే భోగి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈసారి మారుతీ ఎప్పటిలాగా హీరోకి ఏదో ఒక ఒంక పెట్టకుండా.. ఈసారి హీరోయిన్ పై ట్రై చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉండడమే కాదు.. హీరోయిన్ కి గ్లామర్ మాత్రమే కాకుండా ఆ పాత్ర ద్వారా కావాల్సినంత కామెడీని పండించడానికి చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి టిక్ టాక్ వీడియోస్ చేసే అలవాటు ఉంటుందట. మరి చాలా తక్కువ కాలంలో టిక్ టాక్ వీడియోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో చూస్తున్నాం. మరి హీరోయిన్ టిక్ టాక్ వీడియోస్ హాబీస్ తో ఈసారి మారుతీ కామెడీని పండించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది.

అయితే మారుతీ ఇంకా సాయి తేజ్ కోసం హీరోయిన్ ని సెట్ చెయ్యలేదు. నిన్నమొన్నటివరకు అనేక రకాల పేర్లు వినబడినా.. తాజాగా మెహ్రీన్ కౌర్ అయితే బావుంటుందని మారుతీ అనుకుంటున్నాడట. కానీ సాయి ధరమ్ మాత్రం మెహ్రీన్ వద్దని అడ్డుపడుతున్నాడని టాక్. ఇక నిర్మాతలు అయితే మెహ్రీన్ కి అయితే గట్టిగా ఇవ్వాలి గనక అల్లు శిరీష్ తో కలిసి ఎబిసిడి లో నటించిన రుస్కర్ ని సాయి తేజ్ కి జోడిగా తీసుకోబోతున్నారని అంటున్నారు. మరి రుస్కర్ టిక్ టాక్ వీడియోస్ తో మారుతీ సినిమాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యబోతుందన్నమాట.

Tags:    

Similar News