సాయి చరిత్రాత్మక చిత్రంలో నటిస్తాడా...?

Update: 2018-07-05 07:16 GMT

ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న సాయిధరమ్ తేజ్ హీరోగా నిలబడ్డానికి బాగా ట్రై చేస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. హిట్ మాత్రం పడడం లేదు. ప్రసుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యూలో నటించిన సాయిధరమ్ తేజ్ ఆ సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ్ ఐ లవ్ యూ సినిమాపై ట్రేడ్ లో మంచి బజ్ ఉంది. అయిదు ఈ సినిమా తర్వాత తేజ్ మరో దర్శకుడికి కనెక్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా ఈడు గోల్డ్ ఎహే తో ఫ్లాప్ లో ఉన్న వీరు పోట్లకి సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.

చారిత్రక కథకు...

ప్రస్తుతం టాలీవుడ్ లో చరిత్రాత్మక కథలపై దర్శకులు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసాడు. ఇక చిరంజీవి చరిత్రాత్మాక చిత్రం సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు. అందుకే టాలీవుడ్ దర్శకులంతా చరిత్రాత్మక కథల వెంట పడ్డారు. ఇక ఇప్పుడు వీరు పోట్ల కూడా సాయిధరమ్ తేజ్ తో కృష్ణదేవరాయల కాలం నాటి ఒక కథను చెయ్యడానికి సిద్దమయ్యాడట. మరి ఆనాటి ఒక కథను రెడీ చేసుకుని.. సాయి ధరమ్ కి వినిపించగా... కథ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.

ఇప్పడే ఇలాంటి సినిమాలా...

ఇక తేజ్ ఐ లవ్ యూ విడుదలైన తర్వాత వీరు పోట్ల - సాయి ధరమ్ తేజ్ ల ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే మరో పక్క సాయిధరమ్ తేజ్ ఇలాంటి కథతో సినిమా చేస్తే వర్క్ అవుట్ అవుతుందా అనే డౌట్ మాత్రం వస్తుంది. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా చరిత్రాత్మక చిత్రాలు చెయ్యడం అనేది కరెక్ట్ కాదని కొందరి వాదన.

Similar News