అటు తేజు... ఇటు మైత్రి మూవీస్ వారు..!

Update: 2018-11-28 07:08 GMT

మెగా హీరోలలో ఒకడైనా సాయి ధరమ్ తేజ్ కు ప్రస్తుతం క్రేజ్ తగ్గటమే కాదు మార్కెట్ కూడా పడిపోయింది. వరసగా మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో అతని మార్కెట్ షేర్‌ దారుణంగా పడిపోయింది. తేజ్‌ నటించిన 'నక్షత్రం', 'ఇంటిలిజెంట్‌', 'తేజ్‌ ఐ లవ్యూ' అన్నీ మూడు, నాలుగు కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకున్నాయి అంటే అతని మార్కెట్ ఎంతలా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇతను ప్రస్తుతం 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా కోసం తేజు తన మేకోవర్ నే మార్చేశాడు. అయితే ప్రస్తుతం ఇతనికి మార్కెట్ లేకపోవడంతో తేజ్‌కి ఇచ్చే పారితోషికంలో కూడా కోత విధించారు నిర్మాతలు. సినిమాకి సంబంధించి హయ్యస్ట్‌ చెక్‌ అందుకుంది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అట.

జాగ్రత్త పడుతున్న మైత్రీ మూవీ మేకర్స్

దేవి తన సినిమాల్లో రెండు మూడు పాటలకు మంచి ట్యూన్స్ ఇస్తాడు కాబట్టి అవి సినిమాను మరింత హైప్ తీసుకుని వస్తాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్ దేవి విషయంలో కాంప్రమైజ్‌ అవలేదట. ఒకప్పుడు మైత్రి మూవీస్ వారు సినిమాలో పనిచేసే అందరికీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేవారు. కానీ వరసగా రెండు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో కొంచెం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. 'చిత్రలహరి' విషయంలో అటువంటి జాగ్రత్తలే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ఖర్చులు తగ్గించి, తక్కువ ధరలకి విక్రయించి ఎలా అయినా హిట్ చేయాలని డైరెక్టర్ పై ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. మరోవైపు తేజు కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

Similar News