ఇస్మార్ట్ హిట్ తో ఆ హీరో బాధపడుతున్నాడా?

ఏ దర్శకుడైన… కొన్ని సినిమాలను ప్లాప్ చేస్తే చాలు ఇక హీరోలెవరు ఆ దర్శకుడిని కన్నెత్తి చూడరు. అసలు ఒక్క సినిమా ప్లాప్ అయితేనే.. ఆ దర్శకుడు [more]

Update: 2019-07-24 07:39 GMT

ఏ దర్శకుడైన… కొన్ని సినిమాలను ప్లాప్ చేస్తే చాలు ఇక హీరోలెవరు ఆ దర్శకుడిని కన్నెత్తి చూడరు. అసలు ఒక్క సినిమా ప్లాప్ అయితేనే.. ఆ దర్శకుడు మళ్ళీ సినిమా చెయ్యాలంటే చుక్కలే అన్నట్టుగా ఉంది ప్రస్తుత తీరు. మరి వరసగా నాలుగైదు ప్లాప్స్ కొట్టినా పూరి జగన్నాధ్ ని నమ్మాలంటే కొంచెం కష్టమే. అందుకే చాలామంది యంగ్ అండ్ స్టార్ హీరోలు పూరి ని నమ్మి సినిమా చెయ్యడానికి వెనుకాడారు. అందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడనే టాక్ లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వినబడుతుంది.

పూరి జగన్నాధ్ ప్లాప్స్ లో ఉన్నప్పుడు మెగా హీరో సాయి ధరమ్ ని కలిసి ఓ సినిమా చేద్దామని అడిగాడట. ఆ సినిమా మాస్ ని మెచ్చేలా ఉంటుందని ఎంతగా చెప్పినా సాయి ధరమ్ మాత్రం పూరి జగన్నాధ్ ని నమ్మలేదట. కానీ ఇప్పుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టేసరికి .. సాయి ధరమ్ తెగ ఫీల్ అవుతున్నాడట. అయ్యో అనవసరంగా మాస్ దర్శకుడుని వదిలేసుకున్నానే అని ఫీల్ అవుతున్నాడట. అసలు టాక్ తో సంబంధం లేకుండా ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందాయే. మరి ఇస్మార్ట్ హిట్ తర్వాత తేజ్ పూరి ని పిలిచి సినిమా చేద్దామంటే పూరి ఒప్పుకోవాలిగా… గతంలోనే జనగణమన సినిమా అనుకున్నప్పుడు మహేష్ ఛాన్స్ ఇవ్వలేదని… అప్పుడు మహేష్ తీరుకు ఈమధ్యనే పూరి పంచ్ వేసిన సంగతి గుర్తొచ్చి సాయి ధరమ్ కూడా పూరి ని కలిసి సినిమా చేద్దామని అడిగే సాహసం చేయలేదంటున్నారు. ఇక సాయి ధరమ్ చిత్రలహరితో యావరేజ్ అందుకుని మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే సినిమాతో సెట్స్ మీదున్నాడు.

Tags:    

Similar News