హిట్ కొట్టాడు.. గిఫ్ట్ పట్టాడు

దర్శకుడు మారుతీ భలేభలే మగాడివోయ్ సినిమా తర్వాత మళ్ళి ఆ రెంజ్ హిట్ ప్రతి రోజు పండగే సినిమాతో అందుకున్నాడు. ఇటు మారుతీ కెరీర్లోనూ, సాయి తేజ్ [more]

Update: 2020-01-09 06:17 GMT

దర్శకుడు మారుతీ భలేభలే మగాడివోయ్ సినిమా తర్వాత మళ్ళి ఆ రెంజ్ హిట్ ప్రతి రోజు పండగే సినిమాతో అందుకున్నాడు. ఇటు మారుతీ కెరీర్లోనూ, సాయి తేజ్ కెరీర్ లోను ప్రతి రోజు బిగెస్ట్ హిట్ అనే చెప్పాలి. యావరేజ్ టాక్ తోనే సాయి తేజ్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ప్రతి రోజు పండగే నిలిచింది. ప్రస్తుతం ప్రతి రోజు పండగే ఇంకా కలెక్షన్ కొల్లగొడుతూనే ఉంది. అయితే మొత్తంగా 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ప్రతి రోజు పండగే సినిమాతో మారుతీ తో సినిమా చెయ్యడానికి చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లివ్వడానికి క్యూ కట్టారనే టాక్ ఉంది.

ఇక ప్రతి రాజు పండగే హిట్ కావడంతో.. తమ సంస్థకు మంచి హిట్ అందించిన మారుతికి ఆ సినిమా నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ ఓ గిఫ్ట్ అందజేశాడు. మరి మారుతీ కెరీర్ లో ఇదే ఫస్ట్ గిఫ్ట్ కావడం గమనార్హం. దర్శకుడు మారుతికి నిర్మాత వంశి రేంజ్ రోవర్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చి… తనకి మరిపోలేని హిట్ ఇచ్చినందుకు మారుతికి కూడా మరిచిపోలేని గిఫ్ట్ అందజేశాడు. వంశి ఇచ్చిన కారు తో మారుతీ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మారుతి అభిమానులైతే హిట్ కొట్టాడు గిఫ్ట్ పట్టాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మారుతీ కూడా ఊహించని ఖరీదైన బహుమతి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు

Tags:    

Similar News