మార్కెట్ తగ్గింది… బడ్జెట్ కూడా తగ్గింది..!

తన మొదటి సినిమాతో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కు గత ఆరు చిత్రాల నుంచి అంతగా కలిసి రావడం లేదు. వరుసగా ఆరు సినిమాలు [more]

Update: 2019-02-28 07:17 GMT

తన మొదటి సినిమాతో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కు గత ఆరు చిత్రాల నుంచి అంతగా కలిసి రావడం లేదు. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తేజు మార్కెట్ కూడా బాగా దెబ్బతింది. 2015లో సుప్రీం సినిమా తరువాత ఇంతవరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు తేజుకి. అతను ప్రస్తుతం చేసిన ‘చిత్రల‌హరి’ ఫలితం బట్టే తన ఫ్యూచర్ ఆధారపడి ఉంది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నపటికీ బడ్జెట్ విషయంలో మాత్రం బాగానే కోతలు పడుతున్నట్లు తెలుస్తోంది.

16 కూడా కాదు 14 మాత్రమే…

ముందుగా ఈ సినిమాను 20 కోట్లలో తీద్దాం అనుకున్నారు కానీ తేజు మార్కెట్ పడిపోవడంతో 16 కోట్లకు ఫిక్స్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం 16 కూడా కాదట ఇంకా తక్కువ బడ్జెట్ తో రూపొందించారని టాక్. 14 కోట్లలోనే సినిమాని పూర్తి చేసేలా కనిపిస్తున్నారట నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వడం మెగా మేనల్లుడికి చాలా అవసరం.

Tags:    

Similar News