ఫ్లాప్ టీం మొత్తం ఒక్కచోట చేరింది!

Update: 2018-10-16 06:21 GMT

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫ్లాప్ ల ఊబిలో కొట్టుకుపోయాడు. జవాన్, తేజ్ ఐ లవ్ యూ వంటి సినిమాల ఫ్లాప్ తో ప్రస్తుతం ఎవరికీ కనబడకుండా తిరుగుతున్న సాయి ధరమ్ తేజ్... కొత్త లుక్ తో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఉన్న సినిమాని మొదలు పెట్టాడు రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మొత్తం ఫ్లాప్ టీమ్ కనబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ పెద్దగా న్యూ లుక్ లో అయితే కనబడడం లేదుగానీ.. గుబురు గడ్డంతో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు.

అంతా ఫ్లాప్ టీమే...

అయితే తాజాగా మొదలైన చిత్రలహరి సినిమాలో ఫ్లాప్ హీరోయిన్ మేఘ ఆకాష్ సాయి ధరమ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఫ్లాప్ కొట్టిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మించడం అనేది మాత్రం కాస్త బలం ఇస్తున్న పాయింట్. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన మైత్రి వారు మీడియం హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చెయ్యడం వెనుక మెగా స్టార్ హీరో రామ్ చరణ్ ఉన్నాడనే టాక్ వినబడుతుంది.

మళ్లీ రిస్క్ చేస్తున్నాడా..?

ఇక ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్ తో ఉన్న కిషోర్ తిరుమల, నితిన్ తో చేసిన లై, ఛల్ మోహన రంగా సినిమాల ఫ్లాప్ తో ఉన్న మేఘ ఆకాష్, వరస ఫ్లాప్స్ తో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇలా ఎక్కడ చూసినా అంతా ప్లాప్ టీం కనబడడంతో... మళ్లీ తేజ్ కి టెన్షన్ ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్లాప్స్ తో ఉన్న సాయి ధరమ్ మళ్లీ రిస్క్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Similar News