తేజు కోసం ప్రాణం పెడుతున్నాడా..?

సాయి ధరమ్ తేజ్ కు వరుసగా అరడజను ఫ్లాప్‌ లు ఉన్నాయి. ఇటువంటి టైంలో తేజుకి ఒక హిట్ అనేది చాలా అవసరం. ప్రస్తుతం తేజు నేను [more]

Update: 2019-03-27 11:40 GMT

సాయి ధరమ్ తేజ్ కు వరుసగా అరడజను ఫ్లాప్‌ లు ఉన్నాయి. ఇటువంటి టైంలో తేజుకి ఒక హిట్ అనేది చాలా అవసరం. ప్రస్తుతం తేజు నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు. ఇన్ని ఫ్లాప్‌ చిత్రాల తర్వాత అసలు చిత్రలహరి మూవీకి కనీస స్పందన ఉండదని తేజు ఫిక్స్ అయిపోయాడు. అయితే అనూహ్యంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ని రెండు పాటలు విడుదల కాగా రెండు హైలైట్ అయ్యాయి.

పాటలు బాగుండటంతో…

రెండింటికీ మిలియన్‌కి పైగా వ్యూస్‌ దక్కాయి. క్రేజ్ హీరోస్ చిత్రాలకు సైతం రాని వ్యూస్ తేజు సినిమాకి వస్తున్నాయి. ఈ సాంగ్స్ ఇంతలా హిట్ అవ్వడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్‌ అంటున్నారు. రెండు సాంగ్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. మిగిలిన సాంగ్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇన్సైడ్ టాక్ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ గా వచ్చింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.

Tags:    

Similar News