సాహో విషయంలో ఎవరూ తగ్గట్లేదు..!

Update: 2018-11-23 08:22 GMT

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సాహో' షూటింగ్ అసలు జరుగుతుందో లేదో కూడా అప్ డేట్ లేదు. ఏడాది క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా నుండి ఒక పోస్టర్, చిన్నపాటి టీజర్ మాత్రమే వదిలారు. కానీ నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ అన్నీ భారీ అమౌంట్ చెబుతున్నారు. అన్ని రైట్స్ కలిపి 70 కోట్లు కావాలంటోంది యూవీ క్రియేషన్స్. ముందు నుండే ఇంత చెబుతున్నారు. మళ్లీ తగ్గుతారేమో అని చూస్తే అసలు తగ్గడం లేదు. 70 కోట్లు అయితేనే ఓకే అంటున్నారట. లేకపోతే లేదు అని మొహం మీద చెప్పేస్తున్నారట. దాంతో ఈ సినిమా రైట్స్ పోటీ పడుతున్న జీ తెలుగు, స్టార్ మా, జెమినీ లాంటి సంస్థలకు ఏమీ అర్ధం కానీ పరిస్థితి.

50 కోట్ల వరకు ఒకే అంటున్నారు...

వీరికి ఛానెల్స్ తో పాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి కుదిరితే అన్ని హక్కులు కలిపి గంపగుత్తగా తీసుకోవాలని చూస్తున్నాయి. కానీ యూవీ వారు తగ్గట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఛానెల్స్ అన్ని 50 దగ్గర ఆగాయి. యూవీ వారేమో 70 చెబుతున్నారు. ఇద్దరి మధ్య 20 తేడా ఉంది. 50కి మించి వీరు పెరగడం లేదు. 70 కోట్లకి వీరు తగ్గడం లేదు. దాంతో ఈ మేటర్ ఇప్పుడప్పుడే తెగేలా లేదు.

Similar News