‘సాహో’ నిర్మాతలు అంత చెప్తున్నారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 2019 మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న [more]

Update: 2019-03-04 10:54 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 2019 మోస్ట్ అవైటెడ్ మూవీ 'సాహో' ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ సంస్థ దాదాపు 230 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు వీడియోస్ వదిలారు. 'షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 1' సంచలనాల తర్వాత 'షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 2 ‘ రిలీజ్ చేసారు. రెండింటికీ అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుందని టాక్. హిందీ శాటిలైట్స్ కి దాదాపు 90 కోట్ల మేర పలికిందన్న చర్చ సాగింది. అలానే ప్రఖ్యాత టీ సిరీస్ సాహో టీమ్ కి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిందని న్యూస్ అందుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వెర్షన్ల థియేట్రికల్ రైట్స్ కి గంపగుత్తగా రూ.240 కోట్లు ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతుంది.

350 కోట్లు అయితేనే…

అయితే ఆ ఆఫర్ ని యు.వి క్రియేషన్స్ సంస్థ రిజెక్ట్ చేసిందని టాక్. 350 కోట్లు అయితే ఓకే అని చెప్పిందట. మరి అందుకు ఆ సంస్థ వారు ఓకే చెపుతారో లేదో చూడాలి. అలానే అమెరికా సహా విదేశాలకు సంబంధించి హక్కుల కోసం యు.వి సంస్థ 45 కోట్లు డిమాండ్ చేస్తోందట. ఈ డీల్ త్వరలోనే క్లోజ్ అవ్వనున్నట్టు సమాచారం. చెప్పడానికి అయితే ఎక్కువ రేట్స్ చెపుతున్నారు కానీ అంత కలెక్ట్ చేస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. బాహుబలి రేంజ్ లో ఆడితేనే అది వర్కవుటవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభాస్ సరసన శ్రద్ధా దాస్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News