ప్రభాస్ 21 కూడా కన్ఫర్మ్ అయిపోయింది

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం `సాహో`. నిన్నే ప్రభాస్ `సాహో` చిత్రం కి సంబంధించి సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ [more]

Update: 2019-07-06 06:10 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'సాహో'. నిన్నే ప్రభాస్ 'సాహో' చిత్రం కి సంబంధించి సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. ఆగస్టు 15 న రిలీజ్ అవుతున్న ఈసినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయిన ఈసినిమాకు 'జాన్' అనే టైటిల్ ను పెట్టారు. ఇది 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ 21 కూడా కన్ఫర్మ్ అయ్యిందట.

ఈ రెండు చిత్రాల తరువాత ప్రభాస్ ఈచిత్రం చేయనున్నాడు. అయితే ఈ సినిమాను కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించి ఓ టాప్ డైరెక్టర్ చిత్రీకరించనున్నారు. కథను మరో రెండు రోజుల్లో ప్రభాస్ విననున్నాడు. ఇది కచ్చితంగా ప్రభాస్ కి నచ్చే కథ అని యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథ అని అంటున్నారు. నిజానికి ప్రభాస్ తో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ ఇప్పటిలో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.అయితే ప్రభాస్ కు కథ వినపించబోయే ఆ కన్నడ టాప్ డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News