ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ నుంచి ‘మహాసముద్రం’

ఆర్ఎక్స్ 100తో అదరగొట్టిన దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. కార్తికేయ – పాయల్ రాజ్ పుట్ జంటగా ఒక [more]

Update: 2019-02-06 10:23 GMT

ఆర్ఎక్స్ 100తో అదరగొట్టిన దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. కార్తికేయ – పాయల్ రాజ్ పుట్ జంటగా ఒక రియలిస్టిక్ కథతో ఆర్ఎక్స్ 100 అంటూ బైక్ పేరుతో సినిమా చేసి అజయ్ సూపర్ హిట్ కొట్టాడు. ఒకే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. ఇండస్ట్రీ చూపుని తనవైపు తిప్పుకున్నాడు. ఇక అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అజయ్ భూపతి బెల్లంకొండ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ సినిమా మాఫియా నేపథ్యంలో ఉండబోతుంది. ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అనే టైటిల్ ని అజయ్ భూపతి ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.

సమంతను ఒప్పించే ప్రయత్నం…

ఇకపోతే ఈ సినిమాలో బెల్లంకొండ సరసన సమంతని సంప్రదిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. శ్రీనివాస్ మొదటి సినిమానే సమంతతో నటించాడు. అల్లుడు శీను సినిమాలో సమంతకు భారీ పారితోషకం ఇచ్చి మరీ ఆమె పక్కన రొమాన్స్ చేసాడు శ్రీనివాస్. మరి ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్రలకే ఓకె చెబుతున్న సమంత భారీ పారితోషకం ఆఫర్ చేసే శ్రీనివాస్ కి ఓకె చేబుతుందా అనేది ప్రస్తుతం అజయ్ – శ్రీనివాస్ ముందున్న అతి పెద్ద సమస్య. మరి అజయ్ భూపతి మాత్రం శ్రీనివాస్ పక్కన సమంత అయితే సూట్ అవుతుందని భావిస్తున్నాడట. అందుకే సమంతని ఒప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట.

Tags:    

Similar News