రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిన డైరెక్టర్ !

Update: 2018-05-23 07:17 GMT

తెలుగులో ఇప్పుడు హవా అంతా యువ దర్శకులదే. మొదటి సినిమాతో హిట్ కొట్టి వెంటనే పెద్ద స్టార్స్ తో సినిమా చేసేస్తున్నారు. అలానే యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకూ ఓ మల్టీ స్టారర్ చేసే అవకాశం వచ్చింది. నాని - నాగార్జునలతో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా హిందీలో రూపొందిన ‘జానీ గద్దర్’ అనే సినిమాకు రీమేక్ అని వార్తలొస్తున్నాయి. లేటెస్ట్ గా వీటిపై స్పందించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఇది రీమేక్ చిత్రం కాదని, ఒరిజినల్ స్క్రిప్ట్ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ సినిమాపై వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.

అశ్వినీదత్ నిర్మాణంలో...

ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా రష్మిక మందన్న నానికి జోడీగా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. గతంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ లాంటి చిత్రాలతో మెప్పించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.

Similar News