దిల్ రాజుకి నిజంగానే కోపం వచ్చిందా..?

Update: 2018-08-06 11:02 GMT

ఏ నిర్మాతకు లేని క్రేజ్ దిల్ రాజుకి ఉంటుంది. దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తే హిట్ ఖాయమంటారు యువ హీరోలు. ఎక్కడో రాజ్ తరుణ్ లాంటి బ్యాడ్ లాక్ హీరోలు తప్ప, యువ హీరోలందరి చూపు దిల్ రాజు బ్యానర్ మీదే ఉంటుంది. కానీ దిల్ రాజు మాత్రం ఏరి కోరి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తాడు. అలాగే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చిందా అంటే.. అతన్ని తన కాంపౌండ్ దాటి బయటికి పోనివ్వడనే టాక్ కూడా ఉంది. శతమానం భవతి అనే హిట్ కుటుంబ కథ చిత్రం చేసిన సతీష్ వేగేశ్నని మళ్లీ శ్రీనివాస కళ్యాణం సినిమాతో కట్టిపడేసాడు. సతీష్ వేగేశ్న రెండో సినిమాని దిల్ రాజుకే చేసాడు.

దర్శకత్వంలో కలగజేసుకుంటున్నాడా..?

అయితే శతమానం భవతితో ఆఫర్ ఇచ్చి తనని డైరెక్టర్ చేసిన దిల్ రాజు అంటే సతీష్ కు గౌరవంతో కూడిన అభిమానం అయితే బాగానే ఉన్నాయి. అందుకే దిల్ రాజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వేలు పెట్టినా ఊరుకునే స్థాయి అభిమానం అయితే ఉంటుందా..? ఏమో అది సతీష్ కే తెలియాలి. ఇంతకీ విషయం ఏమిటంటే దిల్ రాజు ఇప్పుడు తెరవెనుక దర్శకుడిగా మారాడని టాక్ స్ప్రెడ్ అయ్యింది. తాను ఏ సినిమాని నిర్మించిన అన్నీ తానై చూసుకునే తత్వమున్న దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమా డైరెక్షన్ లో వేలు పెట్టి దర్శకుడు సతీష్ వేగేశ్నని ఇబ్బంది పెట్టాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వార్తలపై కలత చెందిన దిల్ రాజు

ఆ నోటా ఈ నోటా అవి దిల్ రాజు చెవికి చేరడం.. వెంటనే లైన్ లోకొచ్చిన దిల్ రాజు ఇలాంటి వార్తలు చూస్తే బాదేస్తుందని.. అలాగే ఈ వార్తలపైనా తానెంతో హార్ట్ అయ్యానని.. అసలు నేను దర్శకుడి వెనక మాత్రమే ఉంటాను. అయినా సినిమా సెట్ లో మేమంతా కలిసి మెలిసి పని చేసుకుంటాం. కథ విని సినిమా చెయ్యడం అనేది నిర్మాత బాధ్యత. అందుకే కథతో పాటుగా డైరెక్టర్, నేను సినిమా మొత్తం కలిసి ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలో నేనేం చేస్తానో.. దర్శకుడు ఏం చేస్తాడో నాకు మత్రమే తెలుసు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచిస్తే బాగుంటుంది... దయచేసి ఇలాంటి రూమర్స్ పుట్టించొద్దు అంటూ తాను ఎంతగా హార్ట్ అయ్యాడో చెప్పాడు దిల్ రాజు.

Similar News