కథ విన్నాక అంతా సైలెంట్ అంటున్న మెగా హీరో

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా #RRR (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా మొదలవ్వకముందు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఏ మీడియా [more]

Update: 2019-01-09 07:42 GMT

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా #RRR (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా మొదలవ్వకముందు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఏ మీడియా మిత్రులు అడిగిన రాజమౌళి మాకు కథ చెప్పలేదని చెప్పేవారు. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్ కథ వినకుండానే రాజమౌళికి కమిట్ అయ్యారనే న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యింది. రాజమౌళి డైరెక్షన్ మీద నమ్మకంగా ఈ హీరోలిద్దరూ గుడ్డిగా రాజమౌళిని ఫాలో అవుతున్నారు అన్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమా ఇంటర్వూస్ లో అసలు కథ చెప్పేసాడు.

ఎన్టీఆర్ ని నన్ను పిలిచి రాజమౌళి కథ చెప్పాడని.. ఆ కథ విన్నక మా మైండ్స్ బ్లాంక్ అయ్యి సైలెంట్ గా ఉండిపోయామని చెప్పిన రామ్ చరణ్… ముందుగా తారక్ తేరుకున్నాడు… కాసేపటికి గాని నేను మళ్ళీ ఈలోకంలోకి రాలేకపోయానని చెబుతున్నాడు. రాజమౌళి ఇలాంటి కథలను ఎలా తీసుకుంటాడో తెలియదని.. కథ రాసుకున్నాకే హీరోలను సెలెక్ట్ చేస్తాడు కానీ.. నన్ను, తారక్ ని తన సినిమాకి అనుకున్న తరవాత కథ అల్లలేదని చెప్పాడు. అలాగే రాజమౌళి లాంటి దర్శకులకు డెడ్ లైన్స్ పెట్టలేమని…. అందుకే తారక్ నేను ఈ సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమా చెయ్యకూడదని అనుకున్నామని కూడా చెప్పాడు.

ఇక తారక్ నేను #RRR ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నప్పుడు.. పెద్దగా ఇబ్బంది పడలేదని.. ఎందుకంటే తాము మంచి స్నేహితులమని చెప్పాడు. ఇక రాజమౌళి తన అభిమానులను, తారక్ అభిమానులని ఎలా తృప్తి పరచాలో తెలుసు అని.. అలాగే ఆయన అభిమానుల అంచనాలు అందుకునేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నాడు. ఇంకా #RRR లో తాను, ఎన్టీఆర్ ప్రత్యేకంగా మెకోవర్స్ లాంటివి ఉండవని.. మాములు కుర్రాళ్ళలాగా ఈసినిమాలో కనిపిస్తామని చెబుతున్నాడు.

Tags:    

Similar News