ఎవడు తరవాత మరోసారి… ?

రామ్ చరణ్ వినయ విధేయరామ డిజాస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి #RRR అనే బడా మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. #RRR మూడో [more]

Update: 2019-04-13 04:15 GMT

రామ్ చరణ్ వినయ విధేయరామ డిజాస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి #RRR అనే బడా మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. #RRR మూడో షెడ్యూల్ లో రామ్ చరణ్ కాలికి గాయమవడంతో. ప్రస్తుతం #RRR షూటింగ్ కి మూడు వారాలపాటు బ్రేకిచ్చారు. ఇక #RRR సినిమా వచ్చే జులై లో విడుదలవుతుండగా.. ఇప్పటినుండే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి? ఎన్టీఆర్ #RRR తర్వాత ఏ దర్శకుడితో చెయ్యబోతున్నాడు? అనే న్యూస్ లు మీడియాలో వినబడుతున్నాయి. తాజాగా #RRR తర్వాత రామ్ చరణ్ మరోసారి వంశి పైడిపల్లి డైరెక్షన్ లో నటించనున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నా వంశి పైడిపల్లి తో రామ్ చరణ్ గతంలో ఎవడు సినిమా చేసాడు. ఆ సినిమా యావరేజ్ హిట్ అయ్యింది. తాజాగా ఈ కాంబో మరోమారు రిపీట్ కాబోతుందనే న్యూస్ వినబడుతుంది. ఈమధ్య ఒక పార్టీలో కలిసిన వంశి పైడిపల్లి… రామ్ చరణ్ కి ఒక స్టోరీ లైన్ చెప్పగా.. అది నచ్చిన రామ్ చరణ్ పూర్తి కథ ని డెవెలెప్ చెయ్యమని చెప్పినట్లుగా ఫిలింనగర్ లో వినబడుతుంది. మరి మహర్షి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో తలమునకలైన వంశి పైడిపల్లి చరణ్ ని ఎప్పుడు కలిసి ఎప్పుడు స్టోరీ లైన్ వినిపించాడో అనేది ప్రస్తుతానికి పజిల్ కానీ.. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News