#RRR నుండి అదిరిపోయే అప్ డేట్

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ #RRR . దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కుస్తున్న ఈచిత్రం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధులైన కొమరం భీమ్, [more]

Update: 2019-06-07 06:32 GMT

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ #RRR . దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కుస్తున్న ఈచిత్రం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో చూపించనున్నారు. ప్రస్తుతం ఈమూవీ యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీగా వేసిన సెట్ లో జరుగుతుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే రామ్ చరణ్ ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈమూవీ కి సంబంధించి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్ సీన్ హైలైట్ గా నిలుస్తాయి. అలానే ఈచిత్రంలో కూడా ఇంటర్వెల్ సీన్ ను గ్రాండ్ గా తెరకెక్కించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట.

ఓ పోరాట సన్నివేశం కోసం ఏకంగా రెండు నెలల లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసారట. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు హీరోస్ పాల్గొననుండగా దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో చిత్రీకరించనున్నారని సమాచారం. కేవలం ఈ సీన్ కోసమే ఏకంగా 45 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఇది ఒక విజువల్ వండర్ గా ఈ పోరాట సన్నివేశాన్ని మలచనున్నారట. ఆ ఒక్క సీన్ కోసమే ఇంత పెడుతున్నారు అంటే ఆ సీన్ ఏ రేంజ్ లో ఉండబోతుందని ఇప్పటినుండే అంచనాలు మొదలయ్యాయి. 350 కోట్లు తో తెరకెక్కుతున్న ఈసినిమా 2020 జులై 30 న రిలీజ్ అవ్వబోతుంది

Tags:    

Similar News