పాపం రితిక..!

Update: 2018-08-29 06:11 GMT

గురు సినిమాతో రితిక సింగ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అవుతుందని.. టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ గురు తర్వాత రితిక సింగ్ కి అసలు సరైన ఆఫర్ టాలీవుడ్ నుండి రాలేదంటే నమ్మాలి. తమిళంలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన శివలింగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. కానీ రితికకి మంచి ఆఫర్స్ మాత్రం వచ్చిన దాఖలాలు లేవు. తాజాగా వచ్చిన అది పినిశెట్టి తో కలిసి జంటగా నటించిన 'నీవెవరో' సినిమాలో రితికకి ఓ అన్నంత పాత్ర ఐతే దక్కలేదు. ఆది పినిశెట్టి హీరోగా.. తాప్సి ప్రధాన పాత్రలో నటించింది. ఇక రితిక సింగ్ ఆదికి జోడిగా చిన్ననాటి స్నేహితురాలిగా గ్లామర్ పాత్రలో కనబడింది.

‘నీవెవరో’ కూడా ఆదుకోలేదు

మరి ఆ సినిమా గత శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమాలో రితిక సింగ్ పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో అంత పేరయితే రాలేదు. ఆదికి స్నేహితురాలిగా ఆదిని వెన్నంటి ఉండే పాత్రలో తన పరిధి మేర రితిక మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టి తో పాటుగా అంత పేరు తెచ్చుకుంది మాత్రం హీరోయిన్ తాప్సినే. తాప్సి వెన్నెల కేరెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ తో రితిక సింగ్ ని డామినేట్ చేసిందనే చెప్పాలి. తాప్సి విలన్ వేషాలు వేస్తూ అంధులను డబ్బు కోసం ప్రేమలోకి దించి వారిని మోసం చేసి పారిపోయే పాత్రలో బాగా ఆకట్టుకుంది. అందుకే తాప్సి పాత్ర ముందు రితిక సింగ్ పాత్ర తేలిపోయింది. మరి ఇలానే ఉంటె రితిక సింగ్ కి ఇక హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తాయంటే కష్టమే అనిపిస్తుంది. గత సినిమాల్లో రితిక యాక్టింగ్ బాగానే చేస్తుంది అన్న పేరు ఉన్నప్పటికీ ఆమెకి మంచి హీరోల పక్కన అవకాశాలు మాత్రం తగలడం లేదు. ఇలానే ఉంటే రితిక్ కెరీర్ కి గండమే మరి. చూద్దాం రితిక సింగ్ హీరోయిన్ కెరీర్ ఎలా వుండబోతుందో అనేది.

Similar News