సెంటిమెంట్ తో మహర్షి రిలీజ్ వాయిదా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ అమెరికాలో ఓ కంపెనీ సీఈఓగా, ఇండియాలో [more]

Update: 2019-01-17 08:44 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ అమెరికాలో ఓ కంపెనీ సీఈఓగా, ఇండియాలో రైతు సమస్యలు తీర్చే నాయకుడిగా కనిపించనున్నాడు. మహేష్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు ఆ నిరయాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం.

ఆ సినిమాలు హిట్ కావడంతో…

దానికి కారణం విడుదల తేదీని ఏప్రిల్ 26వ తేదీకి మార్చే ఆలోచన చేస్తుండటమే. గతంలో మహేష్ చిత్రాలు చూసుకుంటే ఏప్రిల్ చివరిలో విడుదల అయిన పోకిరి’, ‘భరత్ అనే నేను’ సినిమాలు మంచి విజయం సాధించాయి. అందుకే ఆ సెంటిమెంట్ కారణంగా ‘మహర్షి’ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి 26వ తేదీకి మార్చనున్నట్టుగా చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

Tags:    

Similar News