కొత్తరకమైన కథతో రవితేజ..!

Update: 2018-09-29 06:42 GMT

హీరో రవితేజకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుకుంది. అతని సినిమాలు ప్లాపులు అవుతున్నా దర్శకనిర్మాతలు అవేమీ పట్టించుకోవడం లేదు. పెద్దపెద్ద బ్యానర్స్ నుండి రవితేజకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అతను మైత్రి మూవీస్ బ్యానర్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంథోని' అనే సినిమా రీసెంట్ గా కంప్లీట్ చేశాడు. నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రవితేజ తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రవితేజ కి జోడిగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇందులో నభా నటేష్ కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారట. ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు రవి.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా...

ఒక హీరోయిన్ అయితే కంఫర్మ్ అయింది కానీ మరో ఇద్దరు ఇంకా ఫైనలైజ్ కావలి. ప్రస్తుతం వారిని సెలెక్ట్ చేసే పని ఉన్నాడు ఆనంద్. నిజానికి రవితేజ మైత్రి మూవీస్ బ్యానర్ లో సంతోష్ శ్రీనివాస్ తో 'తెరి' రీమేక్ లో నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలు వల్ల అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. మరి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా? లేదా? అన్న విషయం తెలియాల్సిఉంది. విఐ ఆనంద్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని అలరిస్తారని తెలుసు. అయితే ఇప్పుడు కూడా అటువంటి సైంటిఫిక్ థ్రిల్లర్ తో మన ముందుకు వస్తున్నాడు. రవితేజ ఇటువంటి సబ్జెట్ చేయడం ఇదే మొదటిసారి. మరి ఇందులో రవి ఎలా చేస్తాడో అని ఫ్యాన్స్ ఇప్పటినుండే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Similar News