ఆసక్తికర అంశంతో రవితేజ సినిమా..!

Update: 2018-10-13 07:05 GMT

మాస్ రాజా రవితేజ పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగోలేదు. అతను చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ఈ మధ్య చాలా చెత్త సినిమాలు తీస్తున్నాడని పేరు వచ్చింది శ్రీనుకు. ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా వస్తుంది. ఇది త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే.

టైమ్ మిషన్ నేపథ్యంలో...

ఇందులో హీరోయిన్ గా నభా నటేశ్ రవితేజ సరసన నటించనుంది. ఇది 'టైమ్ మిషన్' నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. గతంలో ఈ నేపధ్యంలో 'ఆదిత్య 369' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ కథ మరో కోణంలో కొనసాగుతుందని చెబుతున్నారు. వి.ఐ.ఆనంద్ ఇటువంటి సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్. మరి రవితేజ ఇందులో ఎలా చేస్తాడో అని ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Similar News