గందరగోళంలో రవితేజ..!

వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజ తన కొత్త ప్రాజెక్టుల మీద క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. అమర్ అక్బర్ ఆంటోని, టచ్ చేసి చూడు [more]

Update: 2019-03-12 06:29 GMT

వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజ తన కొత్త ప్రాజెక్టుల మీద క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. అమర్ అక్బర్ ఆంటోని, టచ్ చేసి చూడు దెబ్బకి బాగా డల్ అయిన రవితేజ… నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కోరాజా సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఆకట్టుకున్న వి.ఐ.ఆనంద్ తో కలిసి డిస్కోరాజా సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యి పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. అనుకున్న సమయంలో.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ కాన్సెప్ట్ తోనే టాలీవుడ్ లో మరో చిత్రం తెరకెక్కుతుండడంతో.. ఇప్పుడు డిస్కోరాజా కథకు రిపేర్లు చెయ్యాల్సి వస్తుందట. ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ డిస్కోరాజా కథపై మళ్లీ కూర్చుని వర్క్ చేస్తున్నాడట. అయితే ఎలాగో కొన్ని అవాంతరాల మధ్య పట్టాలెక్కిందిలే అనుకున్న ప్రాజెక్ట్ కాస్తా.. మళ్లీ అనుకోని అవాంతరాలు రాయడంతో రవితేజ కన్ఫ్యూషన్ లో పడ్డాడట.

పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథతో

ఇక అమర్ అక్బర్ ఆంటోని హిట్ అయితే సంతోష్ శ్రీనివాస్ తో తేరి రీమేక్ చేద్దామనుకున్న రవితేజ… అమర్ అక్బర్ దెబ్బకి తేరి రీమేక్ ని పక్కనపడేసి డిస్కోరాజాకి లైన్ క్లియర్ చేస్తే.. ఇప్పుడు ఈ సినిమా సమస్యల్లో చిక్కుల్లో పడింది. దీంతో రవితేజ సంతోష్ శ్రీనివాస్ తో కలిసి తేరి రీమేక్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాడట. మరి సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసిన కథతోనే రవితేజతో సినిమా చెయ్యాలనుకున్నాడు. అయితే ఇప్పుడు రవితేజ గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురు చూస్తున్న సంతోష్.. కొద్ది రోజుల్లో రవితేజతో తేరి రీమేక్ తో సెట్స్ మీదకెళ్తాడట. మరి రవితేజ తేరి రీమేక్ ని ఒకప్పుడు చాలా వేగంగా చేద్దామనుకున్నాడు కానీ అనుకోకుండా లేట్ అవడంతో ఇప్పుడు ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.

Tags:    

Similar News