రవితేజ కోసం మరో హీరో దిగుతాడా?

రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణలో క్రాక్ ఉన్నట్లుగా ప్రకటించడం కరోనా తర్వాత [more]

Update: 2020-09-06 05:57 GMT

రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణలో క్రాక్ ఉన్నట్లుగా ప్రకటించడం కరోనా తర్వాత షూటింగ్ కి రవితేజ వెళ్లిన విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అయితే రవితేజ క్రాక్ తో పాటుగా వరసగా సినిమాలు చేస్తున్నాడు. క్రాక్ తర్వాత రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో రవితేజ ఖిలాడీ సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడనే టాక్ ఉంది.

తాజాగా రవితేజ డ్యూల్ రోల్ కాకుండా మరో హీరో కూడా ఖిలాడీలో నటించబోతున్నాడని… అయితే ఈ మధ్యన సినిమాల్తో క్రేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ కానీ, లేదంటే హీరో శ్రీ విష్ణు కానీ.. రవితేజ ఖిలాడీ లో ఆ పాత్రకి సెట్ అవుతారని… అందుకే రమేష్ వర్మ అటు శ్రీ విష్ణు, ఇటు సత్యదేవ్ లను సంప్రదిస్తున్నదని అంటున్నారు. అలా హీరోలే కాకుండా ఈ సినిమాలో ముగ్గురు మెయిన్ విలన్స్ కూడా ఉండబోతున్నారట. అందులో ఒక విలన్ గా సోను సూద్ ని తీసుకునే యోచనలో ఉన్నారట. ఎలాగూ సోను సూద్ ఈమధ్యన బాగా పాపులర్ అవడం తో విపరీతమైన క్రేజ్ వచ్చింది కాబట్టే.. సోను సూద్ నే మెయిన్ విలన్ గా తీసుకుంటారని వినికిడి.

Tags:    

Similar News