‘డిస్కోరాజా’ ఆగిపోయిందా..?

మాస్ రాజా రవితేజ – వి.ఐ ఆనంద్‌ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ [more]

Update: 2019-05-03 07:15 GMT

మాస్ రాజా రవితేజ – వి.ఐ ఆనంద్‌ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. కారణం బడ్జెట్ ఎక్కువ అయిపోవడం. డైరెక్టర్ ఆనంద్.. రవితేజ మార్కెట్ కి మించి బడ్జెట్ డిజైన్ చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది. అయితే బడ్జెట్ తగ్గించడానికి వి.ఐ ఆనంద్ చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశాడు. స్టార్ హీరోయిన్స్ ప్లేస్ లో కొత్త హీరోయిన్స్ ని తీసుకుందామని డిసైడ్ అయ్యాడు. సెట్స్ వేయాల్సిన అవసరం ఉన్నా అవుట్ డోర్ షూటింగ్‌కి ఫిక్స్ అయ్యాడు.

సినిమా పట్టాలెక్కుతుందా..?

ఇలా ఎన్ని చేసినా బడ్జెట్ కంట్రోల్ అవ్వడం లేదు. చివరికి పాట‌ల్ని కుదిస్తే క‌నీసం కోటి రూపాయ‌లైనా బ‌డ్జెట్ కంట్రోల్‌లోకి వ‌స్తుంద‌ని ఆనంద్ భావిస్తున్నాడ‌ట‌. రవితేజ సినిమాల్లో సాంగ్స్ లేకపోతే ఎలా అని ప్రొడ్యూసర్ భయం. అందుకే ఈ సినిమాని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టు స‌మాచారం. కథ ప్రకారం ఖర్చు పెట్టకపోతే క్వాలిటీ రాద‌న్న‌ది ద‌ర్శ‌కుడి అనుమానం. బడ్జెట్ ఇంకా కంట్రోల్ అవ్వాలంటే హీరో, సాంకేతిక నిపుణులు పారితోషకాలు త‌గ్గించుకోవ‌డం ఒక్క‌టే మార్గం. అందుకు రవితేజనే ఒప్పుకోడు. మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పలేం. పాపం ‘డిస్కో రాజా’కు మరి ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి.

Tags:    

Similar News