క్రిస్మస్ హీరో ఎవరో?

ఈ క్రిస్మస్ పండగకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నలుగురు స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతున్నాయి. [more]

Update: 2019-10-27 11:42 GMT

ఈ క్రిస్మస్ పండగకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నలుగురు స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతున్నాయి. భారీ హిట్లు కొట్టాలని మన హీరోస్ ఉవ్విళ్లూరుతున్నారు. వారు ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ, రవితేజ, నితిన్,సాయి ధరమ్ తేజ్ లు ఈ క్రిస్మస్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు ఉన్నారు.

సంక్రాంతి కి రావాల్సిన బాలయ్య సినిమా కొంచం ముందుగానే వస్తుంది. డిసెంబర్ 20 న ఈమూవీ రిలీజ్ చేయాలనీ తాజాగా డేట్ ఫిక్స్ చేశారు. త్వరలోనే న్యూ లుక్ తో పాటు టైటిల్ ని రివీల్ చేయనున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ తో నిరుత్సాహ పరిచిన బాలయ్య ఈసినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇక అదే రోజు అంటే డిసెంబర్ 20 న రవితేజ -వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కకుతోన్న డిస్కోరాజా సాయిధరమ్ -మారుతి కలయికలో తెరకెక్కుతోన్న 'ప్రతి రోజు పండగే' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

రవితేజకు డిస్కోరాజా హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటె అతనికి హిట్ పడి చాలా ఏళ్ళు అవుతుంది. అలానే సాయి ధరమ్ తేజ్ 'ప్రతి రోజు పండగే' తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నితిన్ 'భీష్మ' కరెక్ట్ గా పండగ రోజు అంటే డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. ఇలా ఒకే రోజు మూడు సినిమాలు రావడంతో ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది

Tags:    

Similar News