ఎట్టకేలకు దారిలోకొచ్చిన హీరో?

వరస ప్లాప్స్ పలకరిస్తున్నా.. పారితోషకం మాత్రం తగ్గనని భీష్మించుకుని కూర్చుని.. వరస అవకాశాలు కోల్పోతున్న రవితేజ ఎట్టకేలకు లైన్ లో కొచ్చినట్టే అనిపిస్తుంది. ఇంతకుముందు పైసా కూడా [more]

Update: 2020-03-15 12:14 GMT

వరస ప్లాప్స్ పలకరిస్తున్నా.. పారితోషకం మాత్రం తగ్గనని భీష్మించుకుని కూర్చుని.. వరస అవకాశాలు కోల్పోతున్న రవితేజ ఎట్టకేలకు లైన్ లో కొచ్చినట్టే అనిపిస్తుంది. ఇంతకుముందు పైసా కూడా తగ్గనని నిర్మాతల కు మొహమాటం లేకుండా చెప్పే రవితేజ ఇప్పుడు నిర్మాతలు ఎలా చెబితే అలా అంటూ తల ఊపుతున్నాడట. ఎందుకంటే వరసగా నాలుగు డిజాస్టర్స్ పడే సరికి తలకెక్కిన దెయ్యం దిగింది ఈ హీరోగారికి. లేదంటే ఒక్క పైసా తక్కువైనా సినిమా చెయ్యనని చెప్పేవాడు. ఇప్పడు రవితేజ తో సినిమా అంటే దర్శకనిర్మాతలెవరు ఆసక్తి చూపడం లేదు. అందుకే రవితేజ తన పద్దతిని మార్చుకున్నాడు. భారీ పారితోషకం అంటే కెరీర్ ముగించేయ్యాలని భయపడిన రవితేజ ఇప్పుడొక నిర్ణయానికి వచ్చాడట.

అది పారితోషకం లేకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకోవడమే కాదు… ఇప్పటికే రవితేజ మేనేజర్ నిర్మాతలకు ఈ కబురు చేరవేస్తున్నాడట. దానితో దర్శకుల్తో పాటు వచ్చి నిర్మాతలు రవితేజ ని కలుస్తున్నారట. ఎలాగూ రవితేజ ఓ మెట్టు దిగి సినిమా లాభాల్లో వాటాకు సిద్దమయ్యాడు కాబట్టి.. సినిమా ఖర్చు విషయంలోనూ రవితేజ కాస్త జాగ్రత్తగా ఉంటాడు. అందుకే నిర్మాతలు కూడా ధైర్యంగా రవితేజ తో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పాపం నిర్మాతలు వెనక్కి తగ్గేసరికి దర్శకులు కూడా రవితేజతో సినిమా అంటే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే ఈపాటికి రవితేజ రెండు మూడు లైన్ లోపెట్టేవాడు

Tags:    

Similar News