రవితేజ మూవీ ఆగిందా?

Update: 2018-07-17 02:53 GMT

ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తన మిత్రుడైన శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'అమర్ అక్బర్ ఆంటోని' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

అలానే 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఇంకో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టును ఆపేసినట్టుగా తెలుస్తోంది. కారణం రవితేజ అని తెలుస్తుంది.

తమిళంలో స్టార్ హీరో విజయ్ హిట్ కొట్టిన 'తెరి' సినిమా నుంచి మూలకథను తీసుకుని ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. అయితే రీసెంట్ గా రవితేజ చేసిన 'నేల టిక్కెట్టు' .. 'టచ్ చేసి చూడు' సినిమాలు వరసగా రెండూ డిజాస్టర్స్ అవ్వడంతో.. ఇప్పుడు ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని.. 'అమర్ అక్బర్ ఆంటోని' రిజల్ట్ చూసి అప్పుడు ఈ సినిమా గురించి ఆలోచిస్తానని అప్పటివరకు హోల్డ్ లో పెట్టమని చెప్పాడంట. సో దీని ప్రకారం చూసుకుంటే 'అమర్ అక్బర్ ఆంటోని' హిట్ అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుంది .. లేదంటే లేదన్న మాట.

Similar News