ఇలియానా ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్

Update: 2018-11-01 02:32 GMT

వరస ప్లాప్స్ తో రవితేజ అండ్ శ్రీను వైట్ల చాలాకాలం తరువాత చేస్తున్న చిత్రం “అమర్ అక్బర్ అంటోనీ”. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాపై అందరిలోనూ భారి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ చూస్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో నటిస్తున్నాడు. చాలా రిచ్ విజువల్స్ తో తెరకెక్కిన ఈచిత్రంను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ ఇలియానా పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర అని సమాచారం. టీజర్ లో చూపించినట్టు ఏమి ఉండదని...సినిమాలో అంత సీను ఉండదంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా మొత్తం మీద ఆమె పాత్ర 30 నిముషాలు లోపే ఉంటుందని టాక్.

మొదట ఈసినిమాలో అను ఎమ్మాన్యుఎల్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆమె ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయింది. ఆ తరువాత ఆమె ప్లేస్ లోకి ఇలియానా వచ్చింది. చాలా కాలం తర్వాత ఇలియానా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరి కన్ను ఆమె పాత్రపై పడింది. కానీ ఆమె పాత్ర చాల తక్కువ సేపే అని తెలియడంతో తన ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. నవంబర్ 16 న రిలీజ్ అవుతున్న ఈసినిమా శ్రీనుని..రవిని ప్లాప్స్ నుండి బయటికి లాగుతుందేమో చూద్దాం

Similar News