తమ హీరో గురించి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

Update: 2018-11-04 05:41 GMT

మాస్ మహారాజ రవితేజ సినిమాల ఓపెనింగ్స్ ఒక్కప్పుడు బాగుండేవి. కానీ ఈమధ్య కాలంలో ఫామ్ కోల్పోయిన రవితేజకు ఈనెల 16న విడుదల అవుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' పై హోప్స్ పెట్టుకున్నాడు. కేవలం రెండు వారాలే ఈసినిమాకు టైం ఉన్న ఇంతవరకు హైప్ కనిపించడం లేదు. దాంతో ఇదికూడా డిజాస్టర్ గా నిలుస్తుందేమో అని ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. దానికి తోడు ఈసినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ వారు నిన్న 'సవ్యసాచి' ని విడుదల చేసారు. అయితే దాని ఫలితం ఈసినిమాపైన పడే అవకాశం ఉంది.

దానికి తోడు 16న ఈసినిమాతో పాటు విజయ్ దేవరకోండ 'టాక్సీవాలా' కూడా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలే ఈ ఏడాది రవితేజకి అంతగా కలిసి రాలేదు. అతను నటించిన 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్టు' దారుణ ఫలితాన్ని అందుకున్నాయి. ఇప్పుడొచ్చే 'అమర్ అక్బర్ ఆంటోనీ' మీద అంత నమ్మకం లేదు ప్రేక్షకుల్లో. సినిమా విడుదలై అద్భుతంగా ఉంది అని టాక్ వస్తే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవడం కష్టం. రవితేజ ఎప్పుడు రొటీన్ కథలు ఎంచుకోవడం...ఎక్కువగా మాస్ ని టార్గెట్ చేయడం ఈ డిజాస్టర్స్ కి కారణం.

ఇలా చేస్తే అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించడం కష్టమే. వి ఐ ఆనంద్ తో ఓకే చేసిన కథకు డిస్కో డాన్సర్ అనే అవుట్ డేటెడ్ టైటిల్ అనుకుంటున్నారనే వార్త అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. అసలే డాన్స్ లో వీక్ గా ఉన్న రవితేజ ఇలాంటివి చేయించడం ఏంటి అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. రవితేజ విభిన్న ప్రయత్నాలు చేయడం బెటర్ అని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. లేకపోతే కష్టమే అని వారి మాట

Similar News