పూజ అయ్యింది.. రష్మిక మిగిలింది!!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పూజ హెగ్డే, రశ్మికనే. వీరి చుట్టూనే హీరోల ప్రదక్షణ ఉంది. ప్రభాస్ తో రాధేశ్యాం చేస్తున్న పూజ హెగ్డే అక్కినేని అఖిల్ [more]

Update: 2020-09-12 04:54 GMT

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పూజ హెగ్డే, రశ్మికనే. వీరి చుట్టూనే హీరోల ప్రదక్షణ ఉంది. ప్రభాస్ తో రాధేశ్యాం చేస్తున్న పూజ హెగ్డే అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తుంది. రాధేశ్యాం ఇప్పట్లో అవ్వకపోయిన.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యచలర్ షూట్ త్వరలోనే పూర్తవుతుంది. ఇక రష్మిక అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీలో నటించాల్సి ఉండగా.. రామ్ చరణ్ తో ఆచార్య నటించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా టాక్. అయితే తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో రశ్మిక్ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కోసం టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ని తీసుకుంటున్న టీం.. ఆమె క్రేజ్ మీదనే సినిమా విజయం ఆధారపడింది అంటుంటే.. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించే సినిమాలోనూ లక్కీ హీరోయిన్ రష్మిక అయితే బావుంటుంది. అక్కడ పూజ నిలబెడితే.. ఇక్కడ రష్మిక అఖిల్ ని నిలబెట్టాలంటున్నారు. అందుకే పూజ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్న అఖిల్ సురేందర్ రెడ్డి సినిమాలో ఖచ్చితంగా రష్మిక తో రొమాన్స్ చేస్తాడు.. వేరే ఆప్షన్ కూడాలేదనే టాక్ వినబడుతుంది. మరి బెల్లకొండ శ్రీనివాస్ లాగా చివరికి అఖిల్ కూడా హీరోయిన్స్  ని నమ్ముకోవాల్సిన పరిస్థితి.

Tags:    

Similar News