ట్రైన్ లో రష్మిక ను ప్రేమలో పడేయనున్న మహేష్

ప్రసుతం మహేష్ బాబు ఫ్యామిలీ తో ట్రిప్ కి వెళ్లారు. తిరిగి రాగానే తన 26 వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. అనిల్ [more]

Update: 2019-06-09 09:39 GMT

ప్రసుతం మహేష్ బాబు ఫ్యామిలీ తో ట్రిప్ కి వెళ్లారు. తిరిగి రాగానే తన 26 వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది. దిల్ రాజు అండ్ అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో రష్మిక పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో మహేష్ పాత్ర… ఆంధ్ర నుండి కాశ్మీర్ ప్రయాణిస్తుండగా రష్మిక మందన్న ను చూసి ప్రేమలో పడతారట. ట్రైన్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు. మహేష్ పాత్ర బట్టి చూస్తే ఇందులో మహేష్ ను లవర్ బాయ్ పాత్రలో చూడొచ్చని తెలుస్తోంది. దాంతో మహేష్ అభిమానులు కూడా తన హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొన్ని కీలక పాత్రల్లో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ నటించనున్నారు. అలానే ఈమూవీకి దేవిశ్రీ సంగీతం హైలైట్ కానుందని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఈమూవీ రిలీజ్ అవుతుందని ముందుగానే ప్రకటించారు మేకర్స్.

Tags:    

Similar News