రష్మిక తెలివైన నిర్ణయమే తీసుకుంది..!

Update: 2018-10-27 07:14 GMT

ఛలో, గీత గోవిందం సినిమాలతో తెలుగమ్మాయి లెక్క అందరిని మెస్మరైజ్ చేసి మరీ సూపర్ హిట్స్ అందుకున్న కన్నడ భామ రష్మిక మందన్న దేవదాస్ తో ఫ్లాప్ అందుకున్నా మంచి క్రేజ్ అయితే సంపాదించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండలో డియర్ కామ్రేడ్ తో పాటు మరో రెండు సినిమాలను సైన్ చేసే యోచనలో రష్మిక ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రష్మిక మందన్న గీత గోవిందం హిట్ కొట్టక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ కెరీర్ మీద ఫోకస్ చేసింది. అయితే గీత గోవిందం హిట్ తో రష్మిక తన పారితోషకాన్ని అమాంతం పెంచేసిందనే టాక్ నడిచింది.

పారితోషకం పెంచవద్దని...

అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలనే కలతో కన్నడ సినిమాలను రష్మిక దూరం పెట్టడంలో భాగంగా ఒక సినిమా నుండి బయటికొచ్చేసిందన్నారు. అయితే టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటున్న తరుణంలో శాండల్‌వుడ్‌ని దూరంగా పెట్టిందనే వార్తలొస్తున్నాయి కాబట్టి ఇటువంటి సమయంలో పారితోషకం పెంచేస్తే అవకాశాలు తగ్గి మొదటికే మోసం వస్తుందని రష్మిక భావిస్తోందట. అందుకే తన పారితోషకాన్ని పెంచకూడదనే నిర్ణయం రష్మిక తీసుకుందట. మరో నాలుగైదు సినిమాల వరకు రష్మిక ముందు నుండి అందుకుంటున్న 50 లక్షలను కంటిన్యూ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరి దీన్ని బట్టి రష్మిక తెలివైన నిర్ణయమే తీసుకుందనేగా దానర్ధం.

Similar News