మేమా ఓటిటికా.. నో అంటున్న మూవీ టీం!!

ప్రస్తుతం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ థియేటర్స్ లోనే విడుదల చేస్తామని.. భీష్మించుకుని కూర్చుని చివరికి ఓటిటి బేరానికి తలొగ్గుతున్నాయి. టాలీవుడ్, [more]

Update: 2020-09-09 10:14 GMT

ప్రస్తుతం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ థియేటర్స్ లోనే విడుదల చేస్తామని.. భీష్మించుకుని కూర్చుని చివరికి ఓటిటి బేరానికి తలొగ్గుతున్నాయి. టాలీవుడ్, కోలీవడో బాలీవుడ్ అందరూ చివరికి ఓటిటి దరికే చేరుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్స్ అయ్యి.. విడుదలకు సిద్దమయిన సినిమాలు థియేటర్స్ తెరిచేందుకు టైం పట్టేలా ఉండడంతో ఓటిటికి అమ్మేస్తున్నారు కానీ… షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు కరోనని లెక్క చెయ్యకుండా షూటింగ్ చేసుకోవడానికి రెడీ అవడం కొన్ని సినిమాలు ఇప్పటికే సెట్స్ మీదకెళ్ళడం జరిగాయి. 

అయితే ఓ 10 శాతం, ఓ 20 శాతం షూటింగ్ పూర్తయితే ఆ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లి విడుదలకు సిద్ధమయ్యేవే. అందులో నితిన్ రంగ్ దే కూడా ఒకటి. నితిన్ – కీర్తి సురేష్ కాంబోలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే షూటింగ్ చాలా తక్కువ పెండింగ్ లో ఉండడం నితిన్ – కీర్తి లు షూటింగ్ కి రెడీ అవడంతో వెంకీ కూడా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు. అయితే షూటింగ్ అయ్యాక ఈ సినిమాని ఓటిటికి అమ్మేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. దిల్ రాజు లాంటి వాళ్లే ఓటిటికి జై కొడుతుంటే మీరో లెక్క అంటున్నా కానీ.. రంగ్ దే నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారట. మా సినిమా ఎట్టిపరిస్థితుల్లో ఓటిటికి ఇవ్వము.. కావాలంటే సంక్రాతి బరిలో దింపుతాం అంటున్నారట. ఈ విషయాన్నీ తమ పిఆర్ టీం ద్వారా సోషల్ ఇండియాలో పోస్ట్ చేయించారట రంగ్ దే నిర్మాతలు.

Tags:    

Similar News