200 కోట్లను వసూల్ చేసి సత్తా చూపుతున్న చరణ్

Update: 2018-05-01 08:55 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా చిత్రం 'రంగస్థలం'. కమెర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల కావొస్తున్నా సినిమాపై హైప్ అలానే ఉంది. నిన్న ఈ చిత్రంకి సంబంధించి మేకర్స్ ఓ ఓఫిషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్రం రూ. 200 కోట్లను రాబట్టింది అని ఓఫిషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఇంత భారీ కలెక్షన్లు రాబట్టి, 'బాహుబలి' చిత్రాల తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది.

మరోపక్క రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే కావడం గమనార్హం. ఈ చిత్రం వచ్చిన 20 రోజులు తర్వాత మహేష్ 'భరత్ అనే నేను' వచ్చింది. ఇప్పటికే రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, 'రంగస్థలం'తో పోటీపడుతూ దూసుకెళుతోంది

Similar News