రంగస్థలం 100 రోజుల వేడుక

Update: 2018-07-09 10:41 GMT

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుపర్ హిట్ గా నిలిచిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుని, రూ.150 కోట్ల మార్క్ కూడా దాటింది. ఈ సందర్భంగా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారు 100 రోజుల వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంచరణ్ తో పాటు ఆయన సోదరి సుశ్మిత, దర్శకుడు సుకుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటీనటులు పాల్గొన్నారు.

Similar News