రానాపై అంత బడ్జెట్టా..?

Update: 2018-07-04 06:03 GMT

ప్రస్తుతం రానా దగ్గుబాటి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల్లో ‘హిరణ్యకశ్యప’ కూడా ఒకటి. ఎప్పటినుండో రానాతో ఇటువంటి సినిమా తీయాలనుకున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. 'రుద్రమదేవి' సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాను స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు గుణశేఖర్. కానీ ప్రీ ప్రొడక్షన్ లో ఈ సినిమా లేట్ అయ్యింది.

పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సుమారు రూ.180 కోట్ల వరకు ఖర్చవుతుందని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారట.

విజువల్ వండర్ గా...

ఇటీవల అయన మీడియాతో మాట్లాడుతూ...ఈ సినిమా కోసం ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఈ సినిమాకు అవసరమైన ఇంద్రలోకం, వైకుంఠం వంటి సెట్స్ ను గీస్తున్నారని తెలిపారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముందుగా లండన్ లోని ఒక స్టూడియోలో చిత్రీకరిద్దాం అనుకున్నా, ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Similar News