రానా కి జోడిగా సాయి పల్లవి.. ఇది ఫిక్స్

Update: 2018-11-02 03:23 GMT

టాలీవుడ్ లో ఫిదా, ఎంసీఏ, కణం వంటి సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు చిత్రంలో నటిస్తుంది. తాను ఒప్పుకునే సినిమాల్లో తన పాత్రలో ప్రత్యేకతను కోరుకునే హీరోయిన్ ఆమె. అయితే కేవలం తన పాత్రలో ప్రాధాన్యత మాత్రమే కాదు.. ఇప్పటివరకు సాయి పల్లవి... హీరో ని డామినేట్ చేసే పాత్రలే ఎక్కువగా చేసింది. ప్రస్తుతం అలాంటి పాత్రలోనే మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైనా వేణు ఉడుగుల.. ఆ సినిమాతో హిట్ కొట్టాడు. సరైన ప్రమోషన్స్ లేక సినిమాకి కలెక్షన్స్ రాలేదు గాని.. ఆ సినిమా మాత్రం సూపర్బ్ గా ఉంటుంది. ఇక ఆ సినిమా తర్వాత వేణు కథానాయక ప్రాధాన్యమున్న కథ రాసుకుని సాయి పల్లవికి వినిపించగా.. అప్పుడే సాయి పల్లవి ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకుందనే టాక్ నడిచింది. అయితే హీరోగా నాని కానీ నితిన్ కానీ శర్వానంద్ కానీ అనుకుంటే... వారు తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం తోనో... సినిమాలో హీరో ప్రాధాన్యత తక్కువనో వేణుకి నో చెప్పేసారు.

అయితే వేణు ఈ కథను హీరో రానాకి వినిపించాడు. కథాకథనాల్లోని కొత్తదనం కారణంగా వెంటనే రానా వేణుతో ఈ సినిమా ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని చెబుతున్నారు. అతి త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈసినిమాలో సాయి పల్లవికి జోడిగా రానా అంటే... మళ్ళీ మనకి ఫిదా గుర్తుకు రాకపోదు. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ లాంటి పొడవైన హీరోతో అదరగొట్టిన సాయి పల్లవి ఇప్పుడు రానాతో ఏ విధంగా నటించేస్తుందో చూడాలి.

Similar News