ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను

Update: 2018-07-12 05:40 GMT

ఈ సినిమా అనుకున్న దగ్గర నుండి బాలకృష్ణకు 'ఎన్టీఆర్' బయోపిక్ విషయంలో ఎన్నో సమస్యలు. సినిమా ఓపెనింగ్ జరిగాక డైరెక్షన్ నుండి తేజ తప్పుకోవడం..ఆ ప్లేస్ లోకి క్రిష్ రావడం...నాదెళ్ల భాస్కర్ రావు బాలకృష్ణకు, డైరెక్టర్ క్రిష్ కు నోటీసులు పంపడం ఇలా చాలానే జరిగాయి. అయితే ఎన్ని సమస్యలు వచ్చిన బాలకృష్ణ మాత్రం బెదరకుండా రీసెంట్ గా ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ‘యన్.టి.ఆర్’ సెట్స్ కు రామోజీరావు వెళ్లారు. దానికి సంబందించిన ఫోటో క్రిష్ తన ట్విట్టర్ లో పెట్టి ఇలా ట్వీట్ చేసాడు...‘యన్.టి.ఆర్’ సెట్స్ లో లెజెండరీ రామోజీరావుని కలిసిన అద్భుత క్షణాలను మర్చిపోలేనని, చిత్ర యూనిట్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురైందని అన్నారు.

ఎన్టీఆర్ సెట్స్ లో రాజమోజీరావు గారితో దాదాపు అరగంట సేపు గడిపిన క్షణాలు మరిచిపోలేనని.. ఆయన దగ్గర నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నానని..ఈ సందర్భంగా రామోజీరావుకి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు క్రిష్ చెప్పారు. ప్రస్తుతం బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది చెబుతున్నారు.

Similar News