ఆఖరి అస్త్రం ప్రయోగిస్తాడట..!

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లోకి తేవడానికి నానా తంటాలు పడుతున్నాడు. నిన్నటి వరకు అసలు సినిమా విడులవుతుందో లేదో అనుకున్న వర్మకి [more]

Update: 2019-03-18 06:45 GMT

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లోకి తేవడానికి నానా తంటాలు పడుతున్నాడు. నిన్నటి వరకు అసలు సినిమా విడులవుతుందో లేదో అనుకున్న వర్మకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి ఊపిరి పీల్చుకున్న వర్మకు ఇప్పుడు సెన్సార్ బోర్డు బ్రేక్ వేస్తుంది. ఈ ఎన్నికల ముందు సినిమాని విడుదల చేసి చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అనుకున్న వర్మ ఆటలు సెన్సార్ వారు సాగనివ్వడం లేదు. లక్షీస్ ఎన్టీఆర్ ప్రోమోస్, ట్రైలర్ తో పిచ్చ హైప్ క్రియేట్ చేసిన వర్మ అక్కడితో ఆగడం లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని కీలక సన్నివేశాలను ఇంటర్నెట్ లో లీక్ చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు. ఇక ఈ శుక్రవారం విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ కారణాలతో వాయిదా పడింది.

హైప్ తగ్గిపోతుందా..?

రాజకీయంగా ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా సెన్సార్‌ ను వాయిదా వేస్తున్నామని తెలియజేసింది. కానీ వర్మ మాత్రం సెన్సార్ బోర్డు కావాలనే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తన సినిమాకి ఇబ్బందులు కలగజేస్తుందని, అందుకే సెన్సార్ బోర్డు పై కేసు పెడుతున్నట్లుగా చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. అసలు ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వడాన్ని ఇష్టమొచ్చినట్లు వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకు లేదని, చట్ట విరుద్ధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తోందని వర్మ ఆరోపిస్తున్నాడు. వర్మ అస్త్రానికి సెన్సార్ బోర్డు తలొగ్గుతుందా చూడాలి. ఒకవేళ సినిమా విడుదల కనుక ఆపితే ప్రస్తుతం వేడి మీదున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ హైప్ కాస్త తగ్గడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News