ప్రేక్షకులను వదలంటున్న వర్మ..!

గత కొన్ని ఏళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ప్రేక్షకులు భయపడిపోతున్నారు. రక్త చరిత్ర తర్వాత మళ్లీ ఇంతవరకు ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చెయ్యలేకపోతున్న వర్మ ఈమధ్యన [more]

Update: 2019-04-01 07:26 GMT

గత కొన్ని ఏళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ప్రేక్షకులు భయపడిపోతున్నారు. రక్త చరిత్ర తర్వాత మళ్లీ ఇంతవరకు ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చెయ్యలేకపోతున్న వర్మ ఈమధ్యన లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ జనాల్లో కాస్త ఆసక్తి రేకెత్తించాడు. ఎన్టీఆర్ జీవితంలో ఆయన మరణానికి ముందు ఆరు నెలల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెరకెక్కించాడు. వర్మ సినిమాలు మొదలైనప్పటి నుండే కాంట్రవర్సీలకు నెలవుగా మారతాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా అలాగే సినిమా మొదలెట్టినప్పటి నుండి వర్మ చెప్పిన ముచ్చట్లు అన్ని ఇన్ని కాదు. తనకి తానుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి భారీ హైప్ పెంచాడు. కానీ సినిమా విడుదలయ్యాక వర్మ అన్ని సినిమాలలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా బోల్తా పడింది.

ఇక తమిళనాడుకు…

ఇప్పటికే వర్మ సినిమాలెవరు చూస్తారు అని ఫిక్స్ అయినవాళ్లు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద ఆసక్తి చూపారంటేనే ఆ సినిమా మీద వర్మ ఎంతలా క్రేజ్ తెచ్చాడో అర్ధమవుతుంది. ఇక ఆ సినిమా ఏపీలో మినహా అని చోట్ల విడుదలైంది. అయితే వర్మ ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఫోకస్ పెడతాడులే అనుకుంటే తాజాగా వర్మ మరో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ బాలయ్య రెండు పార్టులు తీసినా వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మరో పార్టు తీసి చూపించినట్లుగానే ఇప్పుడు తమిళనాట జయలలిత మీద సినిమా చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ విడుదల చేసాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకి, ఆమె స్నేహితురాలు శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ను బేస్ చేసుకుని ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు వర్మ.

ఇది మూడో బయోపిక్

మరి ఇప్పటికే తమిళనాట జయలలిత మీద రెండు మూడు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. డైరెక్టర్ ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా ఒక బయోపిక్ ది ఐరన్ లేడీ , కంగనా హీరోయిన్ విజయ్ డైరెక్షన్ లో తలైవి అంటూ జయలలిత బయోపిక్ లు తెరకెక్కుతుండగా.. ఇప్పుడు వర్మ జయలలితకి, శశికళకి మధ్య ఉన్న రిలేషన్ తో మరో సినిమా ని మొదలెట్టడం చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News