వక్కంతం వంశీ నెక్స్ట్ చరణ్ తోనా?

Update: 2018-05-03 16:32 GMT

దిల్ రాజు కాంపౌండ్‌లో డైరెక్టర్ గా అడుగు పెట్టాక కచ్చితంగా రెండు మూడు సినిమాలు చేసే బయటికి రావాలి. ఇది చాలాసార్లు చూసాం. ఇలానే చాలా మంది నిర్మాతలు చేస్తుంటారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గరకు రాగానే వారితో మల్టిపుల్‌ సినిమాలకి కమిట్ చేయిస్తున్నారు. అలానే డైరెక్టర్ వక్కంతం వంశీకి కూడా రెండవ సినిమాకి ముందే అగ్రిమెంట్‌ జరిగిపోయింది అంట.

స్టోరీ బాగా నచ్చడంతో....

రైటర్ గా చాలా ఏళ్ళు పని చేసిన వంశీ రీసెంట్ గా అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' సినిమా తీసి డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా మే 4న రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత కాకపోయినా గీతా ఆర్ట్స్‌ పర్యవేక్షణలోనే అన్నీ జరిగాయనేది తెలిసిన సంగతే. అల్లు అర్జున్ కు మొదట స్టోరీ చెప్పటానికి వచ్చిన వంశీ.. స్టోరీ బాగా నచ్చడంతో వంశీతో రెండవ చిత్రాన్ని కమిట్‌ చేయించారట.

రామ్ చరణ్ తోనేనా?

అయితే ఇప్పుడు వంశీ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడా? అయితే మరి హీరో ఎవరు? ఆల్రెడీ బన్నీ చేసేసాడు కాబట్టి ఇంకా మెగా కాంపౌండ్‌లో లో పెద్ద హీరోలలో రామ్ చరణ్ తప్ప ఎవరు లేరు. మరి చరణ్ తోనే తన నెక్స్ట్ సినిమానా? మరి చరణ్ అయితే రెండేళ్ల వరకు ఖాళీగా లేడు. మరి వీరిద్దరూ కాకపోతే ఏ హీరోతో సినిమా ఉంటుంది? అన్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మరి వాటికి సమాధానం మరి కొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.

Similar News