అయ్యో.. రామ్ చరణ్ మిస్ అయ్యాడే…!

ఈ మధ్యన స్టార్ హీరోల ఫ్యామిలీస్ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. రామ్ చరణ్ తన భార్య ఉపాసన లు ఎన్టీఆర్ ఫ్యామిలీ తో, మహేష్ ఫ్యామిలీతో ఎంతగా [more]

Update: 2019-04-09 08:42 GMT

ఈ మధ్యన స్టార్ హీరోల ఫ్యామిలీస్ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. రామ్ చరణ్ తన భార్య ఉపాసన లు ఎన్టీఆర్ ఫ్యామిలీ తో, మహేష్ ఫ్యామిలీతో ఎంతగా క్లోజ్ గా ఉంటారో ఇప్పటికే చూశాం. రామ్ చరణ్ – ఎన్టీఆర్ – మహెష్ మంచి స్నేహితులు. ఒకరి పార్టీలకు మరొకరు వెళ్లడం అనేది పరిపాటిగా మారింది. ఇక మహేష్ మహర్షితో బిజీగా ఉంటే… రామ్ చరణ్ #RRRలో గాయపడి రెస్ట్ లో ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా #RRR షూట్ కి గ్యాప్ ఇచ్చాడు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ కలిసి దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఎలాగూ మహేష్ మహర్షి సినిమాకు డైరెక్టర్ వంశీనే కావడం, ఎన్టీఆర్ కి బృందావనంతో వంశీకి మంచి అనుబంధం ఏర్పడడంతో.. ఎన్టీఆర్ కూడా భార్య లక్ష్మీప్రణతితో కలిసి వంశీ పార్టీకి హాజరయ్యాడు.

రామ్ చరణ్ రెస్ట్ లో ఉండటంతో…

మహేష్ భార్య నమ్రత, సితార పాపతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యాడు. మరి ఆ బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్ – లక్ష్మీప్రణతి, మహెష్ – నమ్రత, వంశీ పైడిపల్లి – మాలిని, సితార, వంశీ కూతురు అందరూ ఎంతగా ఎంజాయ్ చేశారో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. అయితే ఈ పార్టీలో రామ్ చరణ్ మిస్ అయ్యాడు. చరణ్ ప్రస్తుతం రెస్ట్ లో ఉండడమే కాదు.. బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేసున్నాడు. ఇక వంశీ పైడిపల్లి భార్య పుట్టినరోజు వేడుకలకి చరణ్, ఆయన భార్య ఉపాసన రాలేకపోయారు. చరణ్ తోనూ వంశీ పైడిపల్లి ఎవడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News